Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

చీమకుర్తిలో కదంతొక్కిన యువగళం దారిపొడవునా వెల్లువెత్తిన జనప్రవాహం

యువనేతకు మహిళలు, యువత సంఘీభావం

సంతనూతలపాడు: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో జనప్రభంజనంగా మారింది. దారిపొడవునా ఎటుచూసిన వెల్లవెత్తిన జనసందోహంతో పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. యువగళానికి యువత, మహిళల పెద్దఎత్తున సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు యువనేతను ఆప్యాయంగా స్వాగతించారు. కిక్కిరిసిన జనంలో సైతం యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. 164వరోజు యువగళం పాదయాత్ర చీమకుర్తి శివారు ఎన్ఎస్ పి కాలనీవద్ద నుంచి ప్రారంభం కాగా, అడుగడగునా జనం పోటెత్తారు. పట్టణంలో ప్రధాన వీధులగుండా కొనసాగిన పాదయాత్ర ఎమ్మార్వో కార్యాలయం సమీపాన బహిరంగసభ వద్దకు చేరుకుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు.  యువనేత ప్రసంగిస్తున్న సేపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం నెహ్రూనగర్, మంచికలపాడు, చీమలమర్రి మీదు సంతనూతలపాడు శివారు వరకు పాదయాత్ర కొనసాగగా, దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. 164వరోజు యువనేత 9.5 కి.మీ.ల దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2177.8 కి.మీ.లు పూర్తయింది.

ఈనేలపై పాదయాత్ర అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం. జోరువాన, వైకాపా బెదిరింపులు లెక్కచేయకుండా తరలి వచ్చారు. సంతనూతలపాడు యూత్ పవర్ సూపర్, చీమకుర్తి గెలక్సీ గ్రానైట్ ప్రపంచం మొత్తం ఫేమస్. మల్లవరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం శ్రీ మోక్షరామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి సంతనూతలపాడు. ప్రజల దాహం తీర్చే రామతీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్లు ఉన్న గొప్ప నేల సంతనూతలపాడు. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు జన్మించిన నేల సంతనూతలపాడు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

సిఎం జగన్!

ఎన్ని కోట్లు ఖర్చయినా ఎస్సి, ఎస్టీ,బిసి, మైనార్టీ విద్యార్థులను ఉచితంగా డాక్టర్లను చేస్తానని మాయ మాటలు చెప్పాడు..ఇప్పుడు మెడికల్ సీట్లు బజార్ లో అమ్మేస్తున్నాడు.  ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్లను జగన్ అమ్ముకుంటున్నాడు.  ఇప్పటివరకూ కన్వీనర్ కోటాలో ఏడాదికి రూ.15 వేల ఫీజు. మాయాబజార్ జగన్ ఫీజు ఎంత పెంచాడో తెలుసా? ఏడాదికి 20 లక్షల ఫీజు ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీ కట్టగలరా? ఒక్క సీటు కోటి రూపాయలు, అదీ ప్రభుత్వ మెడికల్ కాలేజిలో.  దీనిపై ఏం సమాధానం చెబుతారని వైద్య శాఖ మంత్రి రజినిని అడిగితే, విద్యార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా ఆపడానికి సీట్లు అమ్మకానికి పెట్టారట? కిర్గిస్థాన్, జార్జియా, ఫిలిప్పీన్స్‌, ర‌ష్యాలో ఎంబీబీఎస్ చేయ‌డానికి 5+1 సంవ‌త్స‌రాలు రానుపోను చార్జీలు, హాస్ట‌ల్‌తో క‌లిసి కూడా గ‌రిష్టంగా  35 ల‌క్ష‌లు అవుతుంది. ఎపిలో మెడిసిన్ చదవాలంటే రూ.కోటి కావాలి.

గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశాడు!

గ్రానైట్ ఫ్యాక్టరీలకు యూనిట్ రూ.2కి ఇచ్చేలా ఇప్పుడే జిఓపై సంతకం పెట్టి వచ్చానన్నాడు, రాయల్టీ తగ్గించి, గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటానన్నాడు. ఆ పని చేయకపోగా, సర్ చార్జీల పేరుతో పరిశ్రమదారులపై అదనపు భారం మోపాడు. రాయల్టీ ఏకంగా 50శాతం పెంచి పరిశ్రమను దెబ్బతీశాడు. ఈఎస్ఐ హాస్పటల్ ప్రారంభిస్తానని చెప్పి మోసగించాడు, ఒంగోలు డైరీ ప్రారంభిస్తానని, అమూల్ కు కట్టబెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచేసిన రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం. మైనింగ్ యజమానులను మేము ఆదుకుంటాం. మీనుండి నేను కోరేది ఒక్కటే. లక్షలాదిగా యువత కు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించండి.

 అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం .

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం!

 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు – అన్నదాత ఉరితాళ్లు

జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగులనూ వదల్లేదు..!

 వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. పాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే స్పందించలేదు.

దళితులను లైసెన్సులిచ్చిన వైసీపీ

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.  27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.  తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు.  తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.

మైనారిటీలను వదలని వైసీపీ

అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం.

ప్రకాశంను గుండెల్లో పెట్టుకుంటాం!

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి.  వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా?

గుండ్లకమ్మలో ఇసుకను దోచేస్తున్నారు!

గుండ్లకమ్మ నదిలో ఇసుకను దోచేసి కోట్లు సంపాదిస్తున్నారు. వాచ్ మాన్ పోస్టుల నుండి షిఫ్ట్ ఆపరేటర్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ పోస్టుల వరకూ అన్ని సేల్ కి పెట్టారు కలక్షన్ బాబు. ప్రభుత్వ ఉద్యోగస్తుల పోస్టింగ్ కోసం కూడా కలక్షన్ బాబు కి కప్పం కట్టాల్సిందే. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల్ని టార్చర్ చేస్తున్నారు కలక్షన్ బాబు. లారీ కి రూ.5000 వేలు కమిషన్ కట్టకపోతే లారీ కదలదు.  కప్పం కట్టకపోతే కలక్షన్ బాబు కి కోపం వస్తుంది వెంటనే అధికారులను పంపి మైన్ సీజ్ చెయ్యడం, ఫైన్లు వేయించడం పనిగా పెట్టుకున్నారు. మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో కలక్షన్ బాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. గ్రావెల్ దందా లో కోట్లు కొట్టేస్తున్నారు. ఉపాధిహామీ పధకంలో భాగంగా చెయ్యని పనులు చేసినట్టు చూపి దొంగ బిల్లులు డ్రా చేసారు కలక్షన్ బాబు. కలక్షన్ బాబు అందరికి సమన్యాయం చేస్తారట. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కప్పం కడితేనే పని అవుతుంది.

వైసీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ ని ఆదుకుంటాను అని హామీ ఇచ్చాడు. నాశనం చేసాడు.  రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. తగ్గించాడా? సీఎం గా చీమకుర్తి కి వచ్చినప్పుడు యూనిట్ కి రూ.2 తగ్గిస్తూ సంతకం చేసి వచ్చా అన్నాడు. అమలు అయ్యిందా? తగ్గించకపోగా సర్ ఛార్జ్ పేరుతో మరో రూపాయి పెంచాడు. రాయల్టీ 50 శాతం పెంచేసాడు. ఒంగోలు డైరీ తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చి అమూల్ కి కట్టబెట్టాడు, అదీ ఆగిపోయింది. చీమకుర్తి లో ఈఎస్ఐ ఆసుపత్రి కట్టిస్తానని ఇచ్చిన హామీ ఏమైంది? సుబాబుల రైతులకు టన్నుకు రూ.5 వేలు ఇస్తానని చెప్పాడు, ఏఎంసి ల ద్వారా కొనుగోలు చేస్తానని అన్నాడు. టిడిపి హయాంలో టన్ను రూ.4 వేల నుండి రూ.4,500 ఉంటే ఇప్పుడు ఎంత రూ.3 వేల లోపే.

ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం

సంతనూతలపాడును అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, సిసి రోడ్లు వేసి అభివృద్ధి చేసింది టిడిపి. రూ.200 కోట్లతో రోడ్లు వేసాం. రూ.150 కోట్లతో సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించాం. సంతనూతలపాడులో పసుపు జెండా ఎగరేయండి. సుబాబుల్, జామాయిల్ రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం.  గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద కీర్తిపాడు, చీరవనుప్పాలపాడు చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిచేస్తాం. రామతీర్ధం, గుండ్లకమ్మ రిజర్వాయర్లు,కారుమంచి మేజర్ కాలువ  రిపేర్ వర్క్స్ పూర్తి చేస్తాం. చీమకుర్తి మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పధకం ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.

కార్యకర్తలను వేధించిన వారిని వదలను

టిడిపి జెండా మోసిన ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. సంతనూతలపాడులో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. కార్యకర్తల్ని వేధించిన అధికారుల పేర్లను ఎర్ర పుస్తకం లో రాసుకుంటున్నా. జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటాం.టిడిపి వస్తే వర్షాలు రావని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షం పడుతుంది.

లోకేష్ ను కలిసిన చీమకుర్తి మండల చేనేత కార్మికులు

సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి నెహ్రూనగర్ లో మండల చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నేషనల్ హ్యాండ్లూమ్ సర్వే గణాంకాల ప్రకారం ఏపీలో 69,982మంది చేనేత కార్మికుల నెలసరి ఆదాయం రూ.5వేలకంటే తక్కువ. చేనేతలకు పావలా వడ్డీ, చేనేత ఉత్పత్తుల్లో రిబేట్ వర్తింపజేయాలి. చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలి. చేనేత వస్త్రాల మెటీరియల్ నూలు, రంగులు, రసాయనాలపై 18శాతం జీఎస్టీ రద్దు చేయాలి. చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పాలసీని వర్తింపజేయాలి. మగ్గాల షెడ్లలో పనిచేసే చేనేతలకు నేతన్న నేస్తం అందించాలి. ఏపీ చేనేత సహకార సంఘంలో 2,00,310మంది సభ్యులున్నారు. వీరిలో లక్ష మంది చేనేత పనులు మానేసి కూలీ పనులకు వెళుతున్నారు. నేతన్న నేస్తం పథకం కేవలం 81,700మందికే అందుతోంది. అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. 50ఏళ్లకే చేనేతలు అనారోగ్య సమస్యల ఎదుర్కొంటున్నందున, 50ఏళ్ల వయసున్న వారికి పెన్షన్లు మంజూరు చేయాలి. TDP అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

గత నాలుగేళ్లలో 60 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకోగా, ముఖ్యమంత్రికి కనీసం పరామర్శించే మనసులేదు. చేనేతల కష్టాలను గుర్తించిన గత టీడీపీప్రభుత్వ హయాంలో రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేశాం. టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చాక చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుచేస్తాం.  మగ్గాలున్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. చేనేత కార్మికల కోసం కామన్ వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. అర్హులైన చేనేత కార్మికులందరికీ ఎటువంటి షరతులకు లేకుండా పెన్షన్లు అందజేస్తాం. గతంలో మాదిరిగా యార్న్, పట్టు సబ్సీడీలను అందిస్తాం. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పిస్తాం. చేనేత పనివారలకు సబ్సిడీ రుణాలను అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన మంచికలపాడు గ్రామ దళితులు

సంతనూతలపాడు నియోజకవర్గం మంచికలపాడు గ్రామానికి చెందిన దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేము ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన వాళ్లం. మా ప్రాంతంలో తాగునీరు కలుషితమై వస్తోంది. వీటిని మేం త్రాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నాము. ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో మా ప్రాంతంలో 20మంది చనిపోయారు. మా ప్రాంతంలో ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి శ్మశానవాటిక లేదు, మీరు అధికారంలోకి వచ్చాక శ్మశానాన్ని ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

గత ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన 27సంక్షేమ పథకాలను రద్దు చేసిన వైసీపీ దళితుల అభివృద్ధి కోసం ఖర్చుచేయాల్సిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజి, శ్మశానం ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.

Also Read This Blog :From Village to Vision: Nara Lokesh’s Padayatra Expedition

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *